టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా రామ్ కెరీయర్లోనే బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా హిట్టుకు దూరమైన పూరీకి ఈ సినిమా తిరుగులేని కంబ్యాక్ అయింది. ఇక ప్రొడ్యూసర్ల పాలిట కామధేనువులా కనక వర్షం కురిపించింది. పెట్టిన బడ్జెట్కు రెండింతలు వసూళ్ చేసి బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది.
ఈ క్రమంలో తాజాగా ఈమూవీకి సీక్వెల్ తెరకెక్కుతుంది. డబుల్ ఇస్మార్ట్ పేరుతో రెండు వారాల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. లైగర్ దెబ్బతో కొన్ని నెలలు సైలెంట్ అయిపోయిన పూరి.. మళ్లీ తిరిగి తన ఫామ్లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్రాలు చేస్తున్నాడు. ఈ సారి డబుల్ స్పీడ్తో కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇటీవలే ఆయన షూటింగ్ సెట్లో అడుగుపెట్టినట్లు కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటించాల్సిందే. ఈ సినిమాలో జోడీగా మీనాక్షీ చౌదరీ హీరోయిన్గా నటించనున్నట్లు టాక్. ఇక ఈ సారి మరింత మాస్గా, గ్రాండ్ స్కేల్లో పాన్ ఇండియా సినిమాగా సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు.