HomeTelugu Trending'దృశ్యం-2' ట్రైలర్‌

‘దృశ్యం-2’ ట్రైలర్‌

Drishyam 2 TRAILER
బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దృశ్యం-2’. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన దృశ్యం సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు, హింది, కన్నడ భాషల్లో రిలీజై విజయం సాధించింది. తాజాగా హిందీ ‘దృశ్యం-2’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాకి అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల పోస్టర్‌, టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్లాష్‌ బ్యాక్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ లో.. అజయ్‌ దేవ్‌గణ్, శ్రియ నటన హైలైట్‌గా నిలిచింది. నవంబర్‌ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈసినిమాకి సంగీతం అందిస్తున్నారు. అక్షయ్‌ ఖన్నా, రజత్‌ కపూర్‌, ఇషితా దత్తా తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu