బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ రంజన్’. శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిన్న ముంబైలోని అంధేరి చిత్రకూట్ మైదానంలో జరిగింది. ఈ నేపథ్యంలో సెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షూటింగ్ సిబ్బంది మనీశ్ దేవాశీ(32) మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంపై ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో హీరోహీరోయిన్లు అక్కడ లేకపోవడం వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.