HomeTelugu Trendingక్రికెట్‌ ఆడిన మహేష్‌ బాబు.. వీడియో షేర్‌ చేసిన దర్శకుడు

క్రికెట్‌ ఆడిన మహేష్‌ బాబు.. వీడియో షేర్‌ చేసిన దర్శకుడు

1 9‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ యూనిట్‌ కశ్మీర్‌ షెడ్యూల్‌ను బాగా ఎంజాయ్‌ చేసింది. బ్రేక్‌ టైమ్‌లో అందరూ కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో పాటు ఆయన కుమారుడు గౌతమ్‌, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి క్రికెట్‌ ఆడిన వీడియోను దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. మహేష్‌‌, గౌతమ్‌, వంశీ, మెహర్‌ రమేష్‌తో సరదాగా గడిపినట్లు పేర్కొన్నారు. ‘గౌతమ్‌ నన్ను అవుట్‌ చేశాడు’ అంటూ ఏడుస్తున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రష్మిక హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నారు. విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, నరేష్‌‌, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌రాజు, మహేష్‌బాబు, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కశ్మీర్‌ షెడ్యూల్‌ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్‌ జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!