పరశురాం డైరెక్షన్లో.. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గీతగోవిందం’. ఈ సినిమా సూపర్ హిటై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలతో విజయ్- రష్మిక జంటకు మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ ముగ్గురూ మళ్లీ ఒకే ఫ్రేమ్లో కనిపించారు. పరశురాం, రష్మిక మందన్నాతో కలిసి ఒక్క చోట చేరి సందడి చేసిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు విజయ్ దేవరకొండ. వీరు మళ్లీ కలవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది.
గీతగోవిందం విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఆనాటి మధురక్షణాలను గుర్తు చేసుకుంటూ ఛిల్ అవుట్ అయ్యారు. ఈ రోజు చాలా జరుగుతోంది. మొదటగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. మరొకటి ఏంటంటే ఈ డార్లింగ్స్తో గీతగోవిందం ఐదేండ్లు పూర్తయింది. ఇంకోటి ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ రెడీ అవుతోంది.. అని క్యాప్షన్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్లో సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే మరోవైపు పరశురాం, విజయ్ దేవరకొండ కాంబోలో VD 13 తెరకెక్కుతోంది. హై బడ్జెట్ ఎంటర్టైనర్గా గా రాబోతున్న ఈ సినిమాలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.