HomeTelugu Trendingడాక్టర్‌ ప్రియాంక ఇంటికి వెళ్లిన తెలంగాణ గవర్నర్‌

డాక్టర్‌ ప్రియాంక ఇంటికి వెళ్లిన తెలంగాణ గవర్నర్‌

11 23దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి ఇంటికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెళ్లారు. శంషాబాద్‌ నక్షత్ర కాలనీలోని ప్రియాంక ఇంటికి వెళ్లిన ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. ఇది దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్న గవర్నర్.. మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఉండాలనీ.. ఈ కేసులో దర్యాప్తు వేగంగా పూర్తవుతుందని, దానిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపుతామని, నేరస్థులను సాధ్యమైనంత త్వరగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలికలు, మహిళల్లో విశ్వాసాన్ని కలిగించడానికి వ్యవస్థలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దుతామని తెలిపారు గవర్నర్. కన్నీటి పర్యంతమైన ప్రియాంక తల్లిని, కుటుంబసభ్యులకు ధైర్యాన్ని చెప్పిన గవర్నర్.. ప్రియాంక రెడ్డి చిత్రపటం దగ్గర పుష్పాలు ఉంచి నివాళులర్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu