HomeTelugu Newsటీఆర్‌ఎస్‌ పై హరీష్‌ శంకర్‌ ట్వీట్‌

టీఆర్‌ఎస్‌ పై హరీష్‌ శంకర్‌ ట్వీట్‌

4 10తెలంగాణలో ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందా? లేదా? అనే విషయం 11-11.30 గంటల సమయంలో తెలిసిపోతుందని అనుకున్నారు కానీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని కౌంటింగ్‌ సరళి చెప్పేస్తోంది.

ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు. ’11-11.30 గంటల సమయంలో ఏ విషయం అన్నది తెలిసిపోతుందని అన్నారు. కానీ ముందుగానే తెలిసిపోయింది. ఇది ప్రజాస్వామ్య పవర్’ అని హరీష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో టీర్‌ఎస్‌ దూసుకెళుతోంది. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!