HomeTelugu Trending'వాల్మీకి' ప్రత్యేక గీతంలో హైదరాబాద్‌ అమ్మాయి

‘వాల్మీకి’ ప్రత్యేక గీతంలో హైదరాబాద్‌ అమ్మాయి

3 25హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ సినిమాలో డింపుల్‌ హయాతీ అనే హైదరాబాద్‌ అమ్మాయి ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోతున్నారు. సాధారణంగా ప్రత్యేక గీతాలంటే బాలీవుడ్‌ నటీమణులను, విదేశీ భామలను ఎంపికచేసుకుంటూ ఉంటారు. కానీ, హరీశ్‌ శంకర్‌ మాత్రం ఈసారి తెలుగమ్మాయికి అవకాశం ఇచ్చారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌ పాత్రను పోషిస్తున్నారు.

సినిమాలో వరుణ్‌, అథర్వలతో కలిసి డింపుల్‌ ఆడిపాడనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘జిగర్తాండ’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. ‘దేవి 2’ సినిమాలో డింపుల్‌ ప్రభుదేవాతో కలిసి కీలక పాత్రలో నటించారు. ‘వాల్మీకి’లో డింపుల్‌ ప్రత్యేక గీతంలో నర్తించనున్నారని ఓ ఆంగ్ల మీడియా రాసిన ఆర్టికల్‌ను హరీశ్‌ శంకర్‌ లైక్‌ చేస్తూ కన్‌ఫర్మ్‌ చేశారు. సెప్టెంబర్‌ 13న ‘వాల్మీకి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu