HomeTelugu Big Storiesమెరుపుదాడిలో 300 ఉగ్రవాదులు హతం?

మెరుపుదాడిలో 300 ఉగ్రవాదులు హతం?

1 26పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్‌ భీకరదాడికి పాల్పడింది. నియంత్రణ రేఖను దాటి బాలాకోట్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. మిరాజ్‌-2000 యుద్ధ విమానాల ద్వారా దాదాపు వెయ్యి కిలోల బరువున్న బాంబులతో ఈ దాడి చేపట్టింది. కాగా.. ఈ ఘటనలో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్ర శిబిరాల్లో బాలాకోట్‌ శిబిరం చాలా పెద్దది. దాదాపు 6 నుంచి 7 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ దాడి జరిగిందంటే మృతుల సంఖ్యే ఎక్కువే ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పాకిస్థాన్‌ మాత్రం ఈ వార్తలను తిప్పికొడుతోంది. పాక్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన భారత యుద్ధ విమానాలను తాము సమర్థంగా తిప్పికొట్టామని ఆ దేశ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ తెలిపారు. తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. పాకిస్థాన్ భూభాగంలోకి 1971 యుద్ధం త‌ర్వాత భార‌త ఫైట‌ర్ జెట్లు వెళ్లడం ఇదే మొద‌టిసారి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu