HomeTelugu Trendingలావణ్య త్రిపాఠి ఇంటిపై ఐటీ దాడులు

లావణ్య త్రిపాఠి ఇంటిపై ఐటీ దాడులు

3 21
టాలీవుడ్ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఇంటిపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు దాడులు చేశారు. నటి ఇంటిపై దాడులు జీఎస్టీ అధికారులు దాడులు చేయడంతో సినిమా ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఆమె ఇంట్లో దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న నటి లావణ్య త్రిపాఠి షూటింగ్ రద్దు చేసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకుంది. ఒక్క నటి ఇంట్లోనే కాకుండా హైదరాబాద్ నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో జీఎస్టీ టీమ్ దాడులు చేస్తున్నది. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఈ టీమ్ దాడులు చేస్తున్నది. ఈ ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. కోట్లలో సర్వీస్ టాక్స్, జీఎస్టీ ఎగవేసినట్టుగా తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu