జబర్దస్త్ యాంకర్ అనసూయను అప్పుడప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. చాలామంది అభిమానులు ఆమె ఫొటోలకు, మెసేజ్లకు ఫిదా అవుతుంటే.. కొందరు మాత్రం ఆమె పెట్టిన పోస్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అనసూయ పెట్టిన ఓ పోస్టుకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. రెడ్ బ్లౌజ్, వైట్ శారీలో దిగిన కొన్ని ఫొటోల్ని అనసూయ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది. వాటిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అనసూయ గారూ.. మీకు పెళ్లైంది… మీకు ఇవన్నీ అవసరమా ? అంటూ కామెంట్ చేశాడు. దీంతో అతడి కామెంట్జపై జబర్దస్త్ ఖతర్నాక్ బ్యూటీ అనసూయ కూడా స్పందించింది. జగదీష్ అనే వ్యక్తి పోస్టు పెట్టడంతో… జగదీష్ గారు మీకు బుర్రలేదు.. ఇలా నాతో మాట్లాడటం అవసరమా అండి? అంటూ అనసూయ ఘాటుగా సమాధానమిచ్చిందీ బ్యూటీ.
Jagadeesh garu.. meeku burra ledu.. meeku ila naato maatladatam avasarama cheppandi. https://t.co/2R58YFF0Uk
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 7, 2019