HomeTelugu Newsరాజధానిని పులివెందులకు మార్చుకోండి: పవన్‌ కళ్యాణ్‌

రాజధానిని పులివెందులకు మార్చుకోండి: పవన్‌ కళ్యాణ్‌

9 4

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమని వ్యాఖ్యానించారు. విశాఖలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు పెడితే పులివెందుల నుంచి వెళ్లిరావడం సులువుగా ఉంటుందన్నారు. దీంతో సీఎం జగన్‌కు ఖర్చు కూడా తగ్గుతుందని పవన్‌ ఎద్దేవా చేశారు. ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్‌కలాం పేరు మార్పుపై ప్రజా వ్యతిరేకత చూసి ఆ జీవో సంగతి తనకు తెలియదని జగన్‌ అంటున్నారని పవన్‌ విమర్శించారు. ఆ జీవో ఇచ్చిన వారిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నేతలతో పవన్‌ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం గాజువాక కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu