బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అధికారులు రియాను కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే రియా ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. రియా బెయిల్ పిటిషన్ను విచారించిన ముంబై సెషన్స్ కోర్టు రియాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ మంజూరు చేస్తే విచారణకు అడ్డంకులు వస్తాయని నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో వాదించింది. రియాతో పాటు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా సోదరుడు షోవిక్ మరో నలుగురి బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. దీంతో రియా ఈనెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉంటుంది. ప్రస్తుతం రియా చక్రవర్తి బైకుల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉండనుంది. సెషన్స్ కోర్టు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో రియా బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్టు రియా తరపు లాయర్ వెల్లడించారు.