టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ నెల(అక్టోబర్) 30న ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లాడనున్నట్టు కాజల్ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఉదయం ఆమె ట్వీట్ చేసింది. కరోనా కారణంగా అతికొద్ది మంది అతిథుల, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ముందు కూడా తనను ఆదరిస్తారిస్తారని ఆకాక్షించింది ఈ చందమామ. కొంతకాలంగా గౌతమ్ కిచ్లు, అగర్వాల్ మధ్య నడిచిన స్నేహం ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగినట్టు సమాచారం.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020