HomeTelugu Newsకళ్యాణ్‌రామ్‌, పూరిల 'ఇజం' చూపించబోతున్నారు!

కళ్యాణ్‌రామ్‌, పూరిల ‘ఇజం’ చూపించబోతున్నారు!

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇజం’. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. “ఇజం” చిత్రం ఆడియో ని అక్టోబర్ 5 న హైదరాబాద్ లో విడుదల చేసారు . అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ ఆడియో కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. ”ఇజం నా కెరీర్ లో ఒక స్పెషల్ చిత్రం గా నిలుస్తుంది అని నమ్ముతున్నాను. పూర్తి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ ఎలిమెంట్ ని ఈ చిత్రం లో డైరెక్టర్ పూరి గారు ప్రెసెంట్ చేసారు. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ వ్యవస్థ, సోషల్ హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ కార్యకలాపాలు లాంటి అంశాలను ఈ చిత్రం టచ్ చేస్తుంది. అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నాం” అని నిర్మాత, హీరో అయిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ తెలిపారు.
ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ‘ఇజం’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సిక్స్ ప్యాక్ బాడీ తో, టోటల్ న్యూ లుక్ లో కనపడుతోన్న కళ్యాణ్ రామ్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం టీజర్ కి ఒకే ఛానల్ లో సుమారు 16 లక్షల వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015 టైటిల్ గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రం లో హీరోయిన్.
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని హైదరాబాద్ మరియు స్పెయిన్ లో చిత్రీకరించారు. ఉత్తమ సాంకేతిక విలువలతో, హై క్వాలిటీ ఔట్పుట్ తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu