బాలీవుడ్ యంగ్ హీరో సుంశాత్ మృత్రితో ప్రారంభమైన విమర్శల ప్రకంపనలు తాజాగా పార్లమెంట్ను తాకాయి. ఈ క్రమంలో ఎంపీ జయా బచ్చన్ చేసిన ప్రకటనను నటి కంగనా రనౌత్ తప్పుపట్టారు. ఆమెకు కొన్ని ప్రశ్నలు సంధించడంతో పాటు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ చర్చ సోమవారం పార్లమెంట్లో భాజపా ఎంపీ రవికిషన్ ప్రస్తావించడంతో మొదలైంది. డ్రగ్స్ వ్యసనం చిత్రపరిశ్రమలో కూడా ఉందని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఆయన మాటలను ఎంపీ జయా బచ్చన్ మంగళవారం తప్పుపట్టారు. కొందరు వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపర్చవద్దని, చిత్ర పరిశ్రమకు చెందిన ఎంపీ ఒకరు దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. మనకు తిండిపెట్టే చేయినే నరుక్కోవద్దని మండిపడ్డారు. ఆ క్రమంలో కంగనా రనౌత్, ఎంపీ రవికిషన్ స్పందించారు.
కంగనా రనౌత్ స్పందిస్తూ.. రాజ్యసభలో జయా మంగళవారం చేసిన ప్రసంగంపై అభ్యంతరం చెబుతూ.. మీ కుమారుడు అభిషేక్ బచ్చక్ కూడా సుశాంత్లా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా అంటూ నిలదీశారు. ఈ మేరకు కంగనా ఓ ట్వీట్ చేశారు.’ రాజ్యసభలో జయాబచ్చన్ మాట్లాడిన తీరు సరైనది కాదు. నాకు మాదిరిగా మీ కుమార్తె స్వేతా బచ్చన్ కుడా టీనేజ్లో వేధింపులు గురైతే ఇలానే స్పందిస్తారా. కొందరు వ్యక్తుల మూలంగా మానసిక ఒత్తిడి గురై సుశాంత్ సింగ్ రాజ్పుత్లా మీ కుమారుడు అభిషేక్ కూడా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా. మాపైన కాస్త జాలి చూపండి’ అని మండిపడ్డారు.
రవికిషన్ కూడా మీడియాతో మాట్లాడుతూ..’నేను మాట్లాడినదానికి జయాజీ మద్దతు ఇస్తారనుకున్నాను. సినీ పరిశ్రమలోని అందరూ డ్రగ్స్ వినియోగించడం లేదు. కానీ, కొందరు ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమను అంతం చేయాలని చూస్తున్నారు. జయాజీ, నేను పరిశ్రమలో చేరినప్పుడు పరిస్థితి ఇలా లేదు. మనం పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.