నిఖిల్, అనుపమ పరమేశ్వరణ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కార్తికేయ-2’. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలై ఈ చిత్రం నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై ఘన విజయం సాధించింది. బహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంతో నిఖిల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.120కోట్ల గ్రాస్ను రూ.60 కోట్లకు పైగా షేర్ను సాధించింది. తాజాగా కార్తికేయ-2 ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమౌవుతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 30నుండి ఓటీటీలో ‘కార్తికేయ-2’ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చందూ మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు. కాగా ఈ సినిమా మలయాళ వెర్షన్ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలలో అత్యధిక ప్రాఫిట్స్ వచ్చిన రెండో సినిమాగా కార్తికేయ-2 నిలిచింది.