HomeTelugu Big Storiesరజినీకాంత్‌ పై నటి కస్తూరీ సంచలన వ్యాఖ్యలు

రజినీకాంత్‌ పై నటి కస్తూరీ సంచలన వ్యాఖ్యలు

Kasthuri shankar sensationa

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆ కారణంగానే రాజకీయప్రవేశం చేయడం లేదు అని తెలిపారు. కాగా ఇటీవలే రజినీ కాంత్‌ ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్ళాడు. తాజాగా దీనిపై నటి కస్తూరీ స్పందించింది. నటి కస్తూరీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కస్తూరీ గృహలక్ష్మి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా సోషల్ మీడియాలో కస్తూరీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవతున్నాయి. ‘చాలా రోజులుగా భారతీయులకు అమెరికాలో అడుగు పెట్టేందుకు పర్మిషన్ లేదు. అలాంటి పరిస్థితిలో రజినీ ఎలా వెళ్లారని ప్రశ్నించింది. అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ అయినా అనుమతించడం లేదు. మరి రజినీ ఎలా వెళ్లారు అనేది పిచ్చిలేపుతుంది’ అంటూ సంచలనానికి తెరలేపింది.

మేయో క్లినిక్ వెళ్లాడు రజినీ. అంటే గుండెకు సంబంధించిన క్లినిక్ అది. మరి రజినీ గారికి అందులో ఏం పని..? సూపర్ స్టార్ కు అమెరికాలో పర్మిషన్ ఎలా దొరికింది? అంటూ చాలా ప్రశ్నలు గుప్పించింది. గతంలో జరిగినవి గుర్తు తెచ్చుకొనే తాను ఈ పోస్ట్ పెట్టినట్లు తెలిపింది. అయితే అందరితో పాటు తాను కూడా రజినీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ ఆమె అడిగిన విధానం పై సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu