HomeTelugu Newsబాలయ్యతో కీర్తి సురేష్‌.!

బాలయ్యతో కీర్తి సురేష్‌.!

11 5
టాలీవుడ్‌లో నేనూ శైల‌జ‌ అంటూ రామ్ సరసన నటించింది కీర్తి సురేష్‌. ఆ త‌ర్వాత వచ్చిన మ‌హాన‌టితో ఎంతో పాపులర్ అయ్యింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి జాతీయ పురస్కారం కూడ లభించింది. ‘మహానటి’కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇప్పుడు చేతిలో మ‌రికొన్ని సినిమాలు ఫుల్ స్వింగ్ మీదుంది కీర్తి పేరు. అది అలా ఉంటే కీర్తి లేటెస్ట్‌‌గా బాల‌య్య‌తో ఓ సినిమాకు సంత‌కం చేసింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌ వార్తలు వినిపిస్తున్నాయి‌. బాల‌కృష్ణ న‌టిస్తున్న లేటెస్ట్ సినిమా రూలర్‌ ముహూర్తం డిసెంబ‌ర్ 6న జ‌రిగిన సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్‌ను డైరెక్ట్ చేసిన బోయ‌పాటి శీనుతో ముచ్చ‌ట‌గా మూడోసారి బాల‌య్య‌ పని చేస్తున్నారు. కీర్తి ప్రస్తుతం ‘మిస్ ఇండియా’లో నటిస్తోంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లుక్‌ను ఇటీవలే కీర్తి బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu