కరోనా వైరస్ భారత దేశం లో విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్స్ ఇప్పటికే విరాళాలను ప్రకటిస్తున్నారు.ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్లు విరాళం ప్రకటించారు. అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధితో పాటు కేరళకు కలిపి మొత్తం 1.25 కోట్లు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.. తమకు అందిన సాయాన్ని ధృవీకరించింది కేరళ సర్కార్. బన్నీకి కేరళ ప్రజలు రుణపడివుంటారన్నారు కేరళ సీఎం విజయన్. బన్నీకి కేరళలోని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అక్కడి ఆడియెన్స్ బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు.