HomeTelugu Big Storiesభీమ్లా నాయక్: ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా కేటీఆర్‌

భీమ్లా నాయక్: ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా కేటీఆర్‌

KTR to attend Bheemla Nayaks special event on 21st Feb

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టిస్టారర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టిన చిత్ర బృందం త్వరలో మూవీ ట్రైలర్‌ విడుదలకు, ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీ-రిలీజ్‌ వేడుకకు డేట్‌ ఫిక్స్‌ చేశారు.

సోమవారం(ఫిబ్రవరి 21) యూసఫ్ గూడ పోలీసు గ్రౌండ్స్‌లో భీమ్లా నాయక్‌ ప్రీ-రిలీజ్‌ కార్యక్రమం జరగనుందని, దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామరావు(కేటీఆర్‌) ముఖ్య అతిథిగా హజరకానున్నారని సీతార ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే కాగా ఈ సినిమాలో నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందించిన ఈ మూవీకి సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహించాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu