సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా విజయవంతంగా వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాలోని ఓ తొలగించిన సన్నివేశాన్ని విడుదల చేసింది. వీడియోలో మహేష్, పూజా హెగ్డే కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే విలన్ పాత్ర పోషించిన కమల్ కామరాజు కాలు అడ్డుపెడతాడు. కానీ మహేష్ అతడిని దాటుకుని వెళ్తాడు. ఆ తర్వాత పూజను క్లాస్కు పంపించి కమల్తో మాట్లాడతాడు. ‘రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అమ్మాయిలతో తిరగ్గానే హీరో అనుకుంటున్నావా?’ అని కమల్ మహేష్తో పొగరుగా మాట్లాడతాడు. ఇందుకు మహేష్.. ‘అనుకోవడం ఏంటి? హీరోనేగా’ అని చెప్పే డైలాగ్తో కూడిన సన్నివేశాన్ని చిత్రబృందం విడుదల చేసింది.
రూ.207 కోట్లు గ్రాస్
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’.. నెల్లూరు, ఆదోని, చిలకలూరిపేట, గాజువాక, గుంటూరు కేంద్రాల్లో 100 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఇప్పటివరకు రూ.207 గ్రాస్ (రూ.113 కోట్ల షేర్) వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది.