సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. దుర్గా, పరశురామ్, డీజే అనే మూడు విభిన్న పాత్రల్లో సుధీర్ బాబు నటిస్తుండగా.. ఈ చిత్రానికి హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. సృష్టి సెల్యూలాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ లాంచ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను అమీర్పేట్లోని ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృనాళిని రవి నటిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.