HomeTelugu Trendingసైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా మంచు విష్ణు

సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా మంచు విష్ణు

Manchu vishnu supports chit
హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి అండగా ఉంటానని సినీ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. బుధవారం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌తో సహా మొత్తం 13మంది మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన బి.సాయితేజ(29) దుర్మరణం పాలయ్యారు.

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ను మెప్పించి, ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరిగా ఎదిగిన సాయితేజ మరణం తెలుగువారిని కలచివేసింది. సాయితేజ మృతి పట్ల సినీ హీరో మంచు విష్ణు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. తమ విద్యా సంస్థలో సాయితేజ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్‌ వరకు చదివిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ప్రకటన చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu