Homeపొలిటికల్తెలుగు రాష్ట్రాలకి భారీ Railway Budget కేటాయింపు ప్రయోజనాలు ఏంటంటే

తెలుగు రాష్ట్రాలకి భారీ Railway Budget కేటాయింపు ప్రయోజనాలు ఏంటంటే

Massive Fund Allocation for Telugu states in Railway Budget 2025
Massive Fund Allocation for Telugu states in Railway Budget 2025

Railway Budget 2025:

తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ భారీ నిధులు కేటాయించడంతో మంచి వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 200 వందే భారత్ రైళ్లు, 100 నమో భారత్ రైళ్లు కేటాయించింది. అలాగే, విజయవాడ – హైదరాబాద్ మధ్య నమో భారత్ రైళ్లను నడపాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మొత్తం: ₹9,147 కోట్లు

తెలంగాణకు కేటాయించిన మొత్తం: ₹5,337 కోట్లు

ఇప్పటి వరకు తెలంగాణకు కేటాయించిన మొత్తం: ₹41,677 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు: ₹84,559 కోట్ల విలువైన పనులు

కేంద్ర ప్రభుత్వం ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నామో భారత్ రైళ్లలో 1000 కిలోమీటర్లు కేవలం ₹450కే ప్రయాణించే వీలుంటుంది. దీని వల్ల అధిక దూర ప్రయాణికులకు భారీ ఉపశమనం లభించనుంది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం, త్వరలో 100 అమృత్ భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగవుతాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత అభివృద్ధి పనులు:

74 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కొనసాగుతోంది.

1,560 కి.మీ. కొత్త రైల్వే లైన్లు వేసారు.

ఈ భారీ కేటాయింపులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ కొత్త రైళ్లు, మెరుగైన సౌకర్యాలు భారత రైల్వేను అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుస్తాయని ఆయన అన్నారు.

తెలుగు రాష్ట్రాలకు రాబోయే రోజుల్లో రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు వేగంగా ప్రయాణించే అవకాశం లభించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu