HomeTelugu Newsడిశంబర్ లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'!

డిశంబర్ లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’!

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 16న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్‌ సన్నాహాలు చేస్తున్నారు. 
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ”పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెలలోనే చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాల్సి వుండగా, ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని డిసెంబర్‌ 16న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని నిర్ణయించాం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్‌ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో కూడా సూపర్‌హిట్‌ అయింది. తప్పకుండా మా బేనర్‌లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు. 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu