HomeTelugu Trendingఅక్షరాలయకు సాయి ధరమ్ తేజ్ భారీ విరాళం

అక్షరాలయకు సాయి ధరమ్ తేజ్ భారీ విరాళం

4 8కొన్నిరోజుల క్రితం వరకు సెలెబ్రిటీలు ఊర్లను, స్కూల్స్ ను దత్తత తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చేవి. ఇటీవల కాలంలో ఆ వార్తలు తగ్గిపోయాయి. తీసుకున్న గ్రామాలను అభివృద్ధి చేస్తూ బిజీగా ఉన్నారు సెలెబ్రిటీలు. మెగాహీరోల్లో చాలామంది గ్రామాలను దత్తత తీసుకొని వాళ్లకు తోచినంతగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఈ లిస్ట్ లో సాయి ధరమ్ తేజ్ కూడా ఉండటం విశేషం. సాయి ధరమ్ తేజ్ అక్షరాలయ అనే స్కూల్‌ను దత్తత తీసుకున్నారు. ఆ స్కూల్ లో చదువుతున్న 100 మంది విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను సాయి ధరమ్ ఏర్పాటు చేస్తున్నారు. థింక్ పీస్ అనే సంస్థ ద్వారా సాయి ధరమ్ తేజ్ ఈ స్కూల్ ను దత్తత తీసుకున్నారట. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా గెలుచుకున్న మొత్తాన్ని సాయి ధరమ్ ఈ స్కూల్ కోసం వినియోగించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu