Homeతెలుగు Newsఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేఘ సంస్థ రూ . 5 కోట్ల విరాళం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేఘ సంస్థ రూ . 5 కోట్ల విరాళం…

కరోనా వైరస్ పై జరుగుతున్నా పోరులో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి నిన్ననే 5 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు అందించారు.

MEIL 5 crore Andhra

అదేవిధంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా 2 కోట్ల రూపాయలు మేఘ ఇంజనీరింగ్ విరాళం ఇచ్చింది. ఈ మేరకు మేఘ ఇంజనీరింగ్ కర్ణాటక రీజియన్ విభాగం అధిపతి సుధీర్ మోహన్ కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్కు అందించారు. అంతే కాకుండా ఇదే క్రమంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి మరో కోటి రూపాయల ఆర్ధిక సహాయం అందించింది మేఘ ఇంజనీరింగ్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంస్థ ప్రతినిధి రంగరాజన్ కలిసి కోటి రూపాయల చెక్కు అందచేసేరు.

రేపు కూడా మరికొన్ని రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం అందజేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు సంస్థ ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu