HomeTelugu Big Storiesబాలయ్య ఫస్ట్‌గెస్ట్‌గా మోహన్‌బాబు

బాలయ్య ఫస్ట్‌గెస్ట్‌గా మోహన్‌బాబు

Mohan Babu is first guest o
నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ ప్రోగ్రామ్‌ని ‘జాంబీ రెడ్డి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదాని మీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే వార్తలు ఇటీవల గుప్పుమన్న విషయం విదితమే. అయితే ఈ ప్రోగ్రాం ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ హాజరయ్యారు. మోహన్ బాబు ని ఇంటర్వ్యూ చేసిన తరువాత సెట్ లో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఫన్ గా నడిచిందని, సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే మంచు ఫ్యామిలీతో బాలకృష్ణకు విబేధాలు ఉన్నాయని, ఒకానొక సమయంలో బాలకృష్ణ అల్లుడు ఓడిపోవడానికి తానే హెల్ప్ చేశానని మోహన్ బాబు మీడియా ముందు వెల్లడించారు. మరి ఆ విషయాలు ఏమైనా ఈ ఇంటర్వ్యూ లో బయటపడనున్నాయా అనేది తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu