HomeTelugu Newsచంద్రబాబును ఓ రేంజ్‌లో తిట్టిన మోహన్‌బాబు

చంద్రబాబును ఓ రేంజ్‌లో తిట్టిన మోహన్‌బాబు

3 1ఏపీ సీఎం చంద్రబాబుపై సినీనటుడు మోహన్ బాబు మండిపడ్డారు. 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడని.. విద్యాభివృద్థికి ఏపీ సర్కార్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఆరోపించారు. మోహన్‌బాబు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాకు ఎంతో సన్నిహితుడని, విద్యానికేతన్ కళాశాల గొప్పదని గతంలో చంద్రబాబే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.

చంద్రబాబు అప్పుడప్పుడు మా కాలేజీకి భిక్షమేస్తూ వచ్చారని మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యానికేతన్ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఎందుకు వాగ్థానాలు చేస్తున్నారని ప్రశ్నించారు అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని నిలదీశారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు.. ఏ రాజకీయ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడడం లేదంటూనే ఎన్నికల దగ్గరలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu