HomeTelugu Newsసెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్ 'మిస్టర్ మజ్ను'

సెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్ ‘మిస్టర్ మజ్ను’

14 4యంగ్‌ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్ రోల్ చేస్తున్నాడు. పార్ట్ టైమ్ లవర్ బాయ్‌గా అఖిల్ సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన సాంగ్ ఆకట్టుకున్నాయి. తొలిప్రేమ సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు మిస్టర్ మజ్ను అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా సెన్సార్ కొద్దిసేపటి క్రితమే పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్.వి.సి.సి బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా.. చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!