కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు తన 38వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా 2016లో ధోనీ జీవితాధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ’ సినిమాను చెన్నైలోని వెట్రి థియేటర్లో ప్రదర్శించారు. దాంతో ధోనీ అభిమానులు చెన్నై సూపర్కింగ్స్ జెర్సీలు ధరించి సినిమా చూసేందుకు థియేటర్కు పోటెత్తారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించారు. ఆయన భార్య సాక్షి పాత్రలో కియారా అద్వాణీ, మాజీ ప్రేయసి ప్రియాంక ఝా పాత్రలో దిశా పటానీ నటించారు. ఐపీఎల్లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.