టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘రంగబలి’. తాజాగా ఈ మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ జరింగింది. ఈ మీట్లో సినీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలతో హీరో నాగశౌర్య విసిగిపోయారు. కాస్త అసహనం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు ఇక చాలు అన్నట్టు కాస్త కోపంతో లేచి వెళ్లిపోయారు. ఆ తరవాత మైక్ అందుకున్న దర్శకుడు పవన్ బాసంశెట్టి అందరికీ థాంక్యూ చెప్పి ముగించారు.
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రంగబలి’. ఈ సినిమా నిన్న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఇక విమర్శకులు అయితే సినిమా బాగాలేదని తీర్పు చెప్పారు. అయితే, ఫస్టాఫ్ హిలేరియస్గా ఉన్నా.. సెకండాఫ్ బోరింగ్గా ఉండటంతో ఆ ప్రభావం సినిమా ఫలితంపై పడిందని విమర్శకులు అంటున్నారు. ఫస్టాఫ్లో సత్య కామెడీకి కపుడు చెక్కలయ్యేలా నవ్వామని.. సెకండాఫ్ కాస్త తగ్గిందనేది ప్రేక్షకుల వెర్షన్. అయితే, చిత్ర యూనిట్ మాత్రం తమ సినిమాకు మంచి కలెక్షన్ వస్తున్నాయని చెబుతోంది. అందుకే, ఈరోజు హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్లో హీరోహీరోయిన్లు నాగశౌర్య, యుక్తి తరేజాతో పాటు నటుడు రాజ్కుమార్ కసిరెడ్డి, దర్శకుడు పవన్ బాసంశెట్టి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో పలువురు సినీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు పవన్, హీరో నాగశౌర్య సమాధానాలు ఇచ్చారు. అయితే, కొంత మంది సీనియర్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు ఇబ్బందికరంగా అనిపించాయి. కొన్ని ప్రశ్నలకు ఒప్పికగా సమాధానం చెప్పాడు శౌర్య. అయితే, ఆ తరవాత మైక్ అందుకున్న జర్నలిస్ట్ దర్శకుడిని, నాగశౌర్యను మరీ విసిగించారు. జర్నలిస్ట్కి, దర్శకుడికి మధ్య ఈ వాదన జరుగుతుండగా హీరో నాగశౌర్య మైక్ తీసుకున్నారు. అతనికి వివరణ ఇచ్చి కోపంతో తన రెండు చేతులను చప్పట్ల మాదిరిగా కొట్టుకుని లేచి వెళ్లిపోయారు.