HomeTelugu Trendingజగన్‌ని చూసి చాలా రోజులైంది.. అందుకే విజయవాడ వచ్చా: నాగార్జున

జగన్‌ని చూసి చాలా రోజులైంది.. అందుకే విజయవాడ వచ్చా: నాగార్జున

Nagarjuna lunch with ap cm

సినీనటుడు అక్కినేని నాగార్జున విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. విజయవాడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్ నా శ్రేయోభిలాషి. జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా రోజులవుతుంది. అందువల్ల విజయవాడ వచ్చాను. జగన్ తో కలిసి లంచ్ చేశాను. ఇది నా వ్యక్తిగత పర్యటన. ఇండస్ట్రీ గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు నాగార్జున. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయల్దేరారు నాగార్జున. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డిలు ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu