HomeTelugu Big Storiesమరింత ఆసక్తిగా బిగ్‌బాస్‌ ఫినాలే: నాగార్జున

మరింత ఆసక్తిగా బిగ్‌బాస్‌ ఫినాలే: నాగార్జున

Nagarjuna says bigg boss 4
తెలుగు బిగ్‌బాస్‌-4 హోస్ట్‌గా వ్యవహరించడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున అన్నారు. బిగ్‌బాస్‌ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వారం కోట్లాదిమంది వీక్షకులకు వినోదం కలిగించడమే అత్యుత్తమ సంతృప్తిగా నిలుస్తుందన్నారు. కాగా ‘స్టార్‌మా’ అందిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌- 4. సెప్టెంబర్ 6న స్టార్ట్‌ అయిన ఈ షోకి మరో రెండు వారాల్లో శుభం కార్డు పడనుంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలతో సహా ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి 19 అడుగు పెట్టగా ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్‌ మాత్రమే మిగిలారు. వీరంతా కూడా బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం పోటీపడుతున్నారు.

ఈ సీజన్‌ గురించి హోస్ట్‌ నాగార్జున మాట్లాడుతూ ‘‘బిగ్‌బాస్‌ ప్రతి వారం కోట్లాది మందికి వినోదం అందించడం అత్యుత్తమ సంతృప్తిని అందిస్తుంది. అదీ మహమ్మారి విజృంభణ లాంటి కష్టసమయంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 గత రికార్డులను తుడిచి పెట్టేసింది. అలాగే జాతీయస్థాయిలో బిగ్‌బాస్‌ 3 సీజన్‌ సృష్టించిన రికార్డులను ఇది అధిగమించింది. 20+ టీవీఆర్‌తో ఇది బిగ్‌బాస్‌ షోలలో అతిపెద్ద ఆవిష్కరణగా నిలిచింది. గతవారం ఏపీ మరియు తెలంగాణాలలో 4 కోట్లకు పైగా వీక్షకులు దీనిని వీక్షించడం ఈ షో పట్ల వారి ప్రేమకు నిదర్శనం. గత 12 వారాలలో జంట రాష్ట్రాలలో దాదాపు 83% మంది వీక్షకులు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 వీక్షించారు. ఇది అపూర్వం. ఇప్పుడు మేము అత్యంత ఉత్సాహ పూరితమైన దశలో ప్రవేశించాము. ఈ షో యొక్క ఫైనల్‌ మరింత ఆసక్తిగా ఉండబోతుంది. బిగ్‌బాస్‌ సీజన్‌4 ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని అన్నారు. కాగా ‘స్టార్‌ మా’ ఇప్పుడు తమ బిగ్‌బాస్‌ షో సమయాన్ని రాత్రి 10 గంటలకు మార్చింది. అదే సమయంలో తమ అతిపెద్ద ఫిక్షన్‌ సీరియల్‌ ‘వదినమ్మ’ను రాత్రి 9.30గంటలకు తీసుకువచ్చింది. దీనితో స్టార్‌ మా ప్రైమ్‌ టైమ్‌ రాత్రి 11 గంటల వరుకు పెంచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu