తెలుగు ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి కారణం విడుదలకి ముందే ఒక సినిమాని యూ ట్యూబ్ లో లీక్ చేయడమే. అందుతున్న సమాచారం ప్రకారం దుర్గాప్రసాద్ అనే ఔత్సాహిక నటుడు నానిగాడు అనే సినిమా తెరకెక్కించారు. ఆయనే హీరోగా నటిస్తూ నిర్మించిన ఆ సినిమాని సీపీ రెడ్డి అనే దర్శకుడు తెరకెక్కించాడు. 40 లక్షల ఖర్చుతో తెరకెక్కించిన ఈ సినిమాని విడుదల చేయడానికి సిద్దమయ్యింది సినిమా యూనిట్. ఈ మధ్యనే సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. అయితే ఇప్పుడు అనుకోకుండా ఈ సినిమాని ఎవరో యూట్యూబ్ లో లీక్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగింది మూవీ యూనిట్. యూట్యూబ్ లింక్ ను వెంటనే తొలగించి తమకు న్యాయం చేయాలని చిత్ర యూనిట్ కోరుతోంది. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అలా చేశాక ఎటువంటి చర్యలు తీసుకోకుంటే రేపు చిత్ర యూనిట్ తో ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హీరో దుర్గాప్రసాద్ హెచ్చరించారు