HomeTelugu Newsవంశీ అందుకే వైసీపీలోకి : లోకేష్‌

వంశీ అందుకే వైసీపీలోకి : లోకేష్‌

5 13టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆస్తులు కాపాడుకునేందుకే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్తున్నారని విమర్శించారు. నిన్న సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్వరలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన వంశీ .. టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈనేపథ్యంలో వంశీ ఆరోపణలపై లోకేష్‌ స్పందించారు. ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టం లేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి, వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భూ సమస్యల వల్లే వంశీ పార్టీ మారుతున్నారని లోకేష్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu