HomeTelugu Big Storiesఆఖరి షెడ్యూల్ లో 'ఒక్కడు మిగిలాడు'!

ఆఖరి షెడ్యూల్ లో ‘ఒక్కడు మిగిలాడు’!

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ నేడు మొదలైంది. హైద్రాబాద్ లోని అల్యూమినమ్ ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ”నేటి నుంచి మొదలైన ఆఖరి షెడ్యూల్ ఈ నెలాఖరుకు ముగుస్తుంది. ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ పనులతోపాటు.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మంచు మనోజ్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తుండగా.. స్టూడెంట్ క్యారెక్టర్ కోసం దాదాపు 12 కేజీలు తగ్గడం విశేషం. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం” అన్నారు. 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu