HomeTelugu Newsతెలుగు భాషను కాలరాస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్‌ కళ్యాన్‌

తెలుగు భాషను కాలరాస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్‌ కళ్యాన్‌

9 11జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు భాషను కాలరాస్తే మట్టిలో కలిసిపోతారంటూ సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. తెలుగు ఉనికిని కాపాడుకునేందుకు మేధావులు తమ గొంతు విప్పాలన్నారు పవన్. తమిళనాడు నుంచి నిరసనలు వస్తే దేశాన్ని శాసించే వ్యక్తులే హిందీ భాష విషయంలో వెనక్కి తగ్గారని పవన్ గుర్తు చేశారు.. మరోవైపు టీడీపీని కూడా వదిలిపెట్టలేదు జనసేనాని.. టీడీపీ చేసిన తప్పులే వైసీపీ చేస్తోందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. తొలి తెలుగు శిలాఫలకాలు లభించిన చోట నుంచి వచ్చిన సీఎం జగన్… తెలుగును నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. ఏపీలో రాజకీయ నాయకులకు తెలుగు భాష పట్ల ప్రేమ లేదని పవన్ విమర్శలు గుప్పించారు. తెలుగు సంస్కృతిని కాపాడమని కోరితే… పాడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu