HomeTelugu Newsగంగానది ప్రక్షాళన పోరాటానికి బాసట నా బాధ్యత: పవన్ కల్యాణ్

గంగానది ప్రక్షాళన పోరాటానికి బాసట నా బాధ్యత: పవన్ కల్యాణ్

5 10

హరిద్వార్ లోని ఆశ్రమంలో జరిగిన జి.డి.అగర్వాల్ సంస్మరణ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గంగను స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలని, నదిలో కాలుష్యం చేరకుండా నియంత్రించాలంటూ ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ చేసిన పోరాటం గురించి తాను ఎప్పటికప్పుడు తెలుసుకునే వాడినని పవన్ కల్యాణ్ తెలిపారు. అగర్వాల్‌ ఆమరణ దీక్షకు కూర్చున్నారని తెలిసి.. ఆయన ఆత్మత్యాగం చేయకుండా ప్రభుత్వం స్పందిస్తుందని భావించానని అన్నారు. దురదృష్టవశాత్తూ ఏ ప్రభుత్వమూ ఆయన్ను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగర్వాల్ మృతిపై దేశం మొత్తం తిరగబడుతుందని భావించానని, కనీసం యూపీ నుంచి కూడా ప్రజా స్పందన లేకపోవడం విస్మయానికి గురిచేసిందన్నారు. ప్రకృతిని పరిరక్షించాలని తపనపడే జి.డి. అగర్వాల్ లాంటి మహనీయుడిని కోల్పోవడం.. జాతి చేసుకున్న దురదృష్టమని అన్నారు. నిరాడంబరంగా ఉండటానికి ఇష్టపడే పవన్‌.. హరిద్వార్‌లో ఓ సాదాసీదా ఆశ్రమంలో గత రెండు రోజులుగా ఉంటున్నారు. జనసేనాని
హరిద్వార్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఆ పార్టీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu