HomeTelugu Newsరోడ్డు ప్రమాదంలో.. మాజీ మంత్రి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో.. మాజీ మంత్రి దుర్మరణం

10 21

విశాఖపట్నం జిల్లాకు చెందిర సీనియర్ నేత, మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా బైక్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన అక్కడ ఉన్న వారు కుటుంబీకులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే బలిరెడ్డి తుదిశ్వాస విడిచారు. బలిరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989, 1999లో చోడవరం నియోజకవర్గం నుంచి సత్యారావు విజయం సాధించారు. మంత్రిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, సమితి ప్రెసిడెంట్ గా, డిసిసిబి చైర్మన్ గా సత్యారావు సేవలందించారు. మంత్రిగా కూడా పనిచేసిన సత్యారావు అప్పట్లో విశాఖ జిల్లా కీలకనేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. వయసు పైబడిన కారణంగా పూర్తి సమయం రాజకీయాలకి కేటాయించకున్నా వైసీపీ కోసం ఆయన తన సేవలు అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu