జనసేనకు చెందిన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ చేయడంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన మద్దతుదారులకు సంబంధించిన 400 అకౌంట్లను ట్విట్టర్ ఎందుకు సస్పెండ్ చేసిందో తనకు తెలియడం లేదన్నారు. ఈమేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. నిస్సహాయులైన ప్రజల తరఫున నిలబడినందుకే ఈ ఖాతాలను సస్పెండ్ చేశారా? అని ట్విట్టర్ యాజమాన్యాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలన్నారు. వెంటనే బ్లాక్ చేసిన తమ సామాజిక మాధ్యమ ఖాతాలను పునరుద్ధరించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్ను డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్కు అభిమానుల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ ట్వీట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు కూడా మద్దతుదార్లు, అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటి పవన్ అభిమానులు, జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాల్ని బ్లాక్ చేయడంపై పవన్ కల్యాణ్ మండిపడుతున్నారు.