పాన్ ఇండియా హీరో ప్రభాస్ చాలా రోజుల గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. చాలా రోజుల క్రితం ప్రభాస్ ఇటలీకి వెళ్లారు. ఆయన కాలుకు సర్జరీ చేయించుకుని, అక్కడే పూర్తిగా విశ్రాంతి తీసుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చారు.
ఎయిర్ పోర్ట్ నుంచి ప్రభాస్ బయటకు వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం సలార్. ఈ డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మరో రెండు పాటలను చిత్రీకరించాల్సి ఉంది. ఆ పాటలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.