HomeTelugu Newsప్రియాంక, నిక్‌ పెళ్లి ఫోటోల రైట్స్ ను భారీ మొత్తాన్నికి అమ్మేశారు

ప్రియాంక, నిక్‌ పెళ్లి ఫోటోల రైట్స్ ను భారీ మొత్తాన్నికి అమ్మేశారు

ప్రియాంక చోప్రా, నికి జోనస్‌ల వివాహం వచ్చే నెలలో జరగబోతున్న సంగతి తెలిసిందే. జోధ్ పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. ఈ వివాహానికి దాదాపు 300 మంది విశిష్ట అతిధులు హాజరవుతున్నట్టు సమాచారం. వీరి వివాహానికి సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

Untitled 1

సెలెబ్రిటీల ఫోటోలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని ఈ జంట క్యాష్ చేసుకోబోతున్నది. ఓ ప్రముఖ సంస్థకు వీరి పెళ్లి ఫోటోల రైట్స్ ను అమ్మేసినట్టుగా తెలుస్తున్నది. దాదాపు 2.5 మిలియన్ డాలర్లకు అంటే రూ.18 కోట్లకు రైట్స్ ను అమ్మేశారట. ఫోటోలను బయటకు రాకుండా ఆ సంస్థ జాగ్రత పడుతున్నట్టు సమాచారం. ఇలా వచ్చిన ఆ డబ్బును ఓ చారిటి సంస్థకోసం వినియోగించబోతున్నట్టుగా తెలుస్తున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu