HomeTelugu Trendingతొలిసారి కూతుర్ని చూపించిన ప్రియాంక చోప్రా.. ఫొటోలు వైరల్‌

తొలిసారి కూతుర్ని చూపించిన ప్రియాంక చోప్రా.. ఫొటోలు వైరల్‌

Priyanka Chopra 1
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనస్ దంపతులు గతేడాది సరోగసీ తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో జన్మించిన మాల్టీ మేరీ మొన్న 15న మొదటి పుట్టిన రోజు జరుపుకుంది. తాజాగా ప్రియాంక తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసింది. వైట్ డ్రెస్ లో మాల్టీ మేరీ ముద్దొస్తోందంటూ ప్రియాంక అభిమానులు సంబరపడుతున్నారు.

ప్రియాంక భర్త నిక్ జోనస్, ఆయన సోదరులకు అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డులు అందుకున్నారు. సోమవారం జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రియాంక, జోనస్ దంపతులు మాల్టీ మేరీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసింది. కూతురును ఎత్తుకుని, ఆడిస్తూ కెమెరాలకు పోజిచ్చింది. ఆపై ఈ ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పంచుకుంది. దీంతో ప్రియాంక కూతురు మాల్టీ మేరీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Priyanka Chopra showed her

ప్రియాంక చోప్రా 2018 సంవత్సరంలో అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి మధ్య వయసు తేడా 10 ఏళ్లు.. తన కంటే పదేళ్ల చిన్నవాడు అయిన నిక్ జోనాస్ ను వివాహం చేసుకోవడం తో ప్రియాంక చోప్రా పై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇద్దరి జోడీని ఇప్పుడు ఎంతో మంది అభిమానిస్తూ ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu