సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’ ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇందుకు ఒకరోజు ముందే రజనీ హిమాలయాలకు వెళ్లారు. బుధవారం ఈ మేరకు యాత్రకు బయలుదేరారు. సాధారణంగా తన సినిమా విడుదలయ్యే సమయంలో హిమాలయాలకు రజనీకాంత్ వెళ్తుంటారు. కొన్నేళ్లుగా ఇలానే చేస్తున్నారు.
జైలర్ రిలీజ్ నేపథ్యంలో చెన్నై నుంచి బెంగళూరుకు ఆయన చేరుకున్నారు. తర్వాత అక్కడి నుంచి హిమాలయాలకు బయల్దేరి వెళ్లారు. నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా లో మలయాళ, కన్నడ సూపర్ స్టార్లు మోహన్లాల్, శివరాజ్కుమార్, సీనియర్ నటులు జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, హీరోయిన్ తమన్నా కీలక పాత్రల్లో నటించారు.