HomeTelugu Newsరకుల్ సంచలన నిర్ణయం.. 50% డిస్కోంట్‌!

రకుల్ సంచలన నిర్ణయం.. 50% డిస్కోంట్‌!

8 5

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కరోనా నేపథ్యంలోనే రకుల్ ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. కరోనా కష్టకాలంలో తీవ్రంగా నష్టపోయిన సినిమా నిర్మాతలకు తనవంతు సాయం అందించాలని అనుకుందట. దానితో రాబోయే సినిమాలకు సగం పారితోషికం మాత్రమే తీసుకోబోతుందట ఈ బ్యూటీ. అంటే, తన రెమ్యునరేషన్‌లో 50 శాతం కోత విధించుకుంటున్నారట. తన పారితోషికంలో కోత గురించి రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ వర్గాల ద్వారా విషయం బయటికి వచ్చింది. నిర్మాతలు కోలుకోవాలంటే నటీనటులు తమ పారితోషికాల్లో కోత విధుంచుకోక తప్పదని భావించిన ఈ బ్యూటీ.. అందుకోసమే తన రెమ్యునరేషన్‌ను 50 శాతం తగ్గించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్, తాప్సీ లు కూడా తమ రెమ్యునరేషన్లను తగ్గించుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరింది రకుల్. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈసినిమాకు కోటిన్నర రెమ్యునరేషన్‌ తీసుకుంటానని చెప్పిన రకుల్ ఇప్పుడు రాబోయే సినిమాలకు సగం రెమ్యూనరేషన్‌ తగ్గించుకుందని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu