HomeTelugu Trendingముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో రామ్‌ చరణ్‌

ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో రామ్‌ చరణ్‌

Ram Charan at Siddhi Vinaya
మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ప్రతి సంవత్సరం ఆయన అయ్యప్ప స్వామి మాలను వేసుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు.

అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు ఎంతో నిష్ఠగా ఉంటారు. అయ్యప్ప దీక్ష సమయంలో చరణ్ కూడా కఠినమైన నియమ నిబంధనలను పాటిస్తారు. అయ్యప్ప మాలతో నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. చెప్పులను ధరించరు. సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను పాటించటం అనేది అక్కడి అభిమానులను ఆకర్షించింది.

మరోవైపు రామ్ చరణ్ సిద్ధి వినాయక ఆలయానికి వచ్చారనే వార్త ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు క్షణాల్లో పాకింది. ఆయనను చూడటానికి అభిమానులు పోటెత్తారు. చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వారిని నిలువరించడానికి సెక్యూరిటీ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. అభిమానుల మధ్య నుంచి వెళ్లడానికి చరణ్ చాలా ఇబ్బంది పడినప్పటికీ… అందరికీ నవ్వుతూ అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక యాడ్ షూటింగ్ కోసం చరణ్ ముంబైకి వెళ్లారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu