మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్కి ప్రస్తుతం షార్ట్ బ్రేక్ పడ్డింది.
ఈ క్రమంలో రామ్ చరణ్ తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ మరియు భారత్ దిగ్గజ బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా లతో కలిసి ఓ మీట్లో కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
అంతే కాకుండా నా ఫ్రెండ్ రామ్ చరణ్ అందుకున్న తాజా సక్సెస్ గోల్డెన్ గ్లోబ్స్ మరియు అకాడమీ అవార్డ్ కి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. చరణ్ కి శుభాకాంక్షలు కూడా తెలియజేసారు. దీనితో కేటీఆర్ పోస్ట్ మరియు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా రామ్చరణ్ ఇటీవలే నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా వచ్చాయి. దీంతో చరణ్కి ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది.