మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, డ్యాన్స్లతో అదరగొట్టినా, చిట్టిబాబుగా ‘రంగస్థలం’లో తన నటనతో కట్టి పడేసినా యంగ్ హీరో రామ్చరణ్కే చెల్లింది. అలాంటి చరణ్ సడెన్గా కెమెరా పట్టుకుని కనపడుతున్నారేంటి? అనుకుంటున్నారా? కేవలం నటన, డ్యాన్స్ మాత్రమే కాదు. చరణ్లో మరోకోణం కూడా ఉంది. ఆయన వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్గా మారారు. వన్యప్రాణి సంరక్షణకు ప్రపంచ స్థాయిలో నిధుల సమీకరణ జరుగుతుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు చెర్రీ కూడా ఇందులో భాగస్వామి కాబోతున్నారు. ఇందుకు తగ్గట్లుగా వన్యప్రాణుల మీద ప్రేమతో తన ఇంట్లో ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
సింహాలు, పులులు, జిరాఫీలు తదితర జంతువుల ఫొటోలను ఇందులో పొందుపరిచారు. వాటిని చెర్రీనే తన కెమెరాలో బంధించారు. ఫొటోలు తీసే సమయంలో ఫొటోగ్రాఫర్లు షాజ్ జంగ్, ఇజాజ్ ఖాన్, ఇషేతా సాల్ గావ్ ఆయనకు సహకారం అందించారు. వీటితో ప్రజల్ని చైతన్య పరచడమే వాళ్ల ఉద్దేశం. ప్రకృతిని కాపాడుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనే స్వచ్ఛంద సంస్థ గత 60 ఏళ్ల కింద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా 5 మిలియన్ల సభ్యులతో 100దేశాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘నేల తల్లిని, ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. అది మన చేతుల్లోనే ఉంది. నేను కెమెరాతో ప్రయాణించడానికి కారణం ఇదే’ అని పేర్కొన్నారు రామ్ చరణ్.